Saturday, January 22, 2011

ధరలను నియంత్రించే వరకూ పోరాటం ఆగదు

నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించే వరకు తమ పోరాటం ఆగదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. పెట్రో ధరల పెరుగుదలను నిరసిస్తూ చంద్రబాబు సికింద్రాబాద్ మోండా మార్కెట్ చంద్రబాబు నుంచి సైకిల్‌యాత్ర ప్రారంభించారు. అనంతరం ఆయన ఆర్‌పీ రోడ్డులోని పెట్రోల్ బంక్ వద్ద వినియోగదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మార్కెట్ లోని వ్యాపారులు, వినియోగదారులతో మాట్లాడుతూ పెరిగిన ధరలతో పేదలు నిత్యావసర వస్తువులు కొనలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాలీగా వెళ్లి ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టనున్నారు. సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేవరకూ పోరాడతామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత వల్లే ధరలు పెరుగుతున్నాయని అన్నారు. పెట్రోలు, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై టీడీపీ నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది.

No comments:

Post a Comment