Tuesday, November 30, 2010

పదవీ స్వీకారం చేస్తున్న మంత్రుల దృశ్యాలు







































 

కొలువు దీరిన మంత్రి వర్గం

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గం బుధవారం పదవీ స్వీకారం చేసింది. 39 మంది గవర్నర్ నరసింహన్ పదవీ స్వీకారం చేయించారు. కిరణ్ మంత్రి వర్గం లో కొత్తగా 11 మంది కి చోటు లభించగా 28 మంది పాత వారే ఉన్నారు. జగన్ వర్గానికి మొండి చేయి చూపారు. 5 గురికి ఉద్వాసన పలికారు. ప్రత్యేకంగా ఆది నుండి జగన్ తో ఉండే పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, శిల్పా మోహన్ లకు మంత్రి వర్గం లో చోటు లభించలేదు. కొత్తగా తోట నరసింహం, ఏరాసు ప్రతాపరెడ్డి, శైలజా నాథ్, టి జి వెంకటేష్, వై ఎస్ వివేకానంద రెడ్డి, బసవరాజు సారయ్య, మహిధర్ రెడ్డి, కాసు వెంకట కృష్ణా రెడ్డి, డి ఎల్ రవీంద్రా రెడ్డి, జానా రెడ్డి, శంకర్ రావులు పదవీ స్వీకారం చేశారు. కిరణ్ మంత్రి వర్గం లో రెడ్డి వర్గానికి పెద్ద పీట వేశారు. మహిళల సంఖ్యను పెంచలేదు.
పదవీ స్వీకారం చేసిన మంత్రులు వీరే...
1. గల్లా అరుణకుమారి, 2.డీకె అరుణ, 3.ఆనం రాంనారాయణ, 4.బస్వరాజు సారయ్య, 5.బాలరాజు, 6.బొత్స సత్యనారాయణ, 7.డీఎల్ రవీంద్రారెడ్డి, 8.దామోదర రాజనర్సింహ, 9.దానం నాగేందర్, 10.దర్మాన ప్రసాదరావు, 11.డొక్కా మాణిక్య వరప్రసాదరావు, 12.ఏరాసు ప్రతాప్‌రెడ్డి, 13.గీతారెడ్డి, 14.జానారెడ్డి, 15.జూపల్లి కృష్ణారావు, 16.కన్నా లక్ష్మీనారాయణ, 17.కాసు వెంకట కృష్ణారెడ్డి, 18.కోమటిరెడ్డి వెంకటరెడ్డి, 19.మానుకోట మహీధర్‌రెడ్డి, 20.మోపిదేవి వెంకటరమణారావు, 21.ముఖేష్ గౌడ్, 22.పార్థసారధి, 23. పితాని సత్యనారాయణ, 24.పొన్నాల లక్ష్మయ్య, 25.రఘువీరారెడ్డి, 26.రాంరెడ్డి వెంకటరెడ్డి, 27. సబితా ఇంద్రారెడ్డి, 28.శైలజానాథ్, 29. శత్రుచర్ల విజయరామరాజు, 30. శంకరరావు, 31. శ్రీధర్‌బాబు, 32. సుదర్శన్‌రెడ్డి, 33. సునీతా లక్ష్మారెడ్డి, 34.అహ్మదుల్లా, 35.టీజీ వెంకటేష్, 36.తోట నర్సింహం, 37. వట్టి వసంత్‌కుమార్, 38. విశ్వరూప్, 39.వైఎస్ వివేకానందరెడ్డి.