Tuesday, November 9, 2010

పత్తిరైతు బేజారు

నిలువునా ముంచుతున్న వ్యాపారులు

(పెద్దపల్లి - సిరా వెలుగు విలేఖరి) : పత్తి రైతులను అడ్తి వ్యాపారులు నిలువునా ముంచుతున్నారు. పెద్దపల్లి మర్కెట్ యార్డుకు మంగళవారం సుమారు 5 వేల క్వి.లుకు పైగా పత్తి రాగా అధికారులు కొనుగోలు చేయకపోవడంతో ఉదయం నుంది రైతులు పడిగాపులు గాశారు. రైతుల అవసరాలను అవకాశంగా తీసుకున్న కొందరు వ్యాపారులు తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తున్నారు. పత్తి క్వింటాలుకు రూ. 4500 ఉండగా 3700 లకే కొనుగోలు చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. అడ్తి వ్యాపారులు రైతులను తూకంలోకూడా మోసం చేయడం విడ్డూరం.

No comments:

Post a Comment