Monday, November 22, 2010

బీడి కార్మికుల సమస్యలపై ఆందోళనలు : ప్రొఫెసర్ కోదండరాం


(కామారెడ్డి, సిరా వెలుగు విలేఖరి ): బీడి కార్మికుల సమస్యలపై మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని రాజకీయ జెఎసి కన్వీనర్ ప్రో.కోదండరాం పిలుపునిచ్చారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశానికి   ఆయన హాజరై మాట్లాడుతూ అప్పుడు  బాబు, వైఎస్  .. ఇప్పుడు రోశయ్య బీడి కార్మికులపై  నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్నారని దుయ్యబట్టారు. 
తెలంగాణా లో ఉన్న తునికాకుపై ఆంధ్రా  గుత్తేదార్ల పెత్తనం ఉందన్నారు. బీడి కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే,చర్చలు విఫలమైతే జె ఎ సి తరపున ఉద్యమాన్ని ఉద్దృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. 

No comments:

Post a Comment