Tuesday, December 14, 2010

మన ఎంపిలు దద్దమ్మలేనా?

రాష్ట్రంలో రైతు భారతం అస్తవ్యస్తమౌతోంది. మద్దతు ధర, దళారుల బెడద, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వీటికి తోడు నానాటికీ చుక్కలనంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యుని బతుకు చిద్రమౌతోంది. రాజకీయంగా రాష్ట్రానికి మేలు చేస్తామని చెప్పి ఢిల్లీకి వెళ్ళిన 32 మంది ఎంపిలు కినుక వహించడం సిగ్గుచేటు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కడానికి ప్రధాన కారణమైన మన ఎంపిలు మన రాష్ట్రం పట్ల వివక్ష చుపుతున్నప్పటికీ ప్రేక్షక పాత్ర వహించడం శోచనీయం. తడిసిన వారి ధాన్యానికి మద్దతు ధర ప్రకటిస్తామని కేంద్రం పక్క రాష్ట్రాల రైతులకు వరాలివ్వడం దారుణం. విపత్తులో ఉన్న రైతాంగానికి న్యాయం జరిగేలా పోరాడకపోతే భవిష్యత్తులో మన ఎంపిలు రైతుల ఆగ్రహానికి గురికాక  తప్పదు.

No comments:

Post a Comment