Wednesday, December 22, 2010

ప్రభుత్వానికి పోయేకాలం వచ్చింది

రైతన్న కంట తడిబెట్టించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయేకాలం వచ్చిందని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి కుమారుడు వై.ఎస్. జగన్ అన్నారు. రైతులు కన్నీరు పెట్టుకుంటే రాష్ట్రానికి అరిష్టమని రాజన్న చెప్పేవారని, అలాంటి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని జగన్ ధ్వజమెత్తారు.

రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని జగన్ నిప్పులు చెరిగారు. విజయవాడలోని కృష్ణాతీరంలోని వైఎస్సార్ ప్రాంగణం వేదిక నుంచి మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.

రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించడానికి ఇంకా ఎంత మంది రైతులు మరణించాలని జగన్ ప్రశ్నించారు. రైతును ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఆదుకుంటారని జగన్ అడిగారు. ఇంకా మూడేళ్ల సమయం ఉందనే అనుకుంటున్న ఈ ప్రభుత్వానికి డిపాజిట్లు దక్కవని జగన్ జోస్యం చెప్పారు.

No comments:

Post a Comment