Sunday, December 26, 2010

తెలంగాణా ఇవ్వకుంటే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం

కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు అల్టిమేటం జారీ చేశారు. జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చే నివేదిక తెలంగాణకు అనుకూలంగా లేకపోతే ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అవసరమైతే మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సైతం వెనుకాడబోమని వారు హెచ్చరించారు. ఇదే అంశంపై సోమవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి తమ అభిప్రాయాన్ని వెల్లడించనున్నట్టు ప్రకటించారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆదివారం భేటీ అయ్యారు. ఇందులో పలువురు నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేయాలనే ప్రతిపాదన పెట్టగా, దీనికి మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. ఫలితంగా డిసెంబరు 31వ తేదీ తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు మరింత గందరగోళంగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా, విద్యార్థులు, ఉద్యమకారుల పెట్టిన కేసులను పూర్తిగా ఎత్తివేసే వరకు రేపటి నుంచి గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద ఎంపీలంతా నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉదయం 11 గంటలకు సమావేశమైన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నేతలు తెలంగాణ అంశంపై మూడు గంటల పాటు విస్తృతంగా చర్చించారు. 

1 comment:

  1. అంతా డ్రామా,అమ్మతల్లి కన్నెర్రజేస్తే తోక ముడుస్తారు.

    ReplyDelete